పోస్ట్‌లు

మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం

చిత్రం
భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు.. పర్యాటకులు వస్తుంటారు. క్షేత్రచరిత్ర/స్థల పురాణం:   మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట! దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్రస్వామి మూల బృందావననా

శ్రీ‌రాముడి పుట్టుక‌లో గ్ర‌హ‌బ‌లం ఎంతంటే..

చిత్రం
గు ణం, రూపం, ధర్మం, జ్ఞానం, పరాక్రమం, కారుణ్యం, త్యాగం, సర్వ ధర్మాలనూ సమన్వయించడం... ఇలా అన్నింటిలోనూ పరిపూర్ణతను ఏ ఒక్కరూ సాధించలేరు. ప్రతి లక్షణం కొద్దికొద్దిగా కలిసి ఉండటమూ అరుదు. ఇందులోని అన్ని లక్షణాల్నీ జీవితాంతమూ సమగ్రంగా కలిగి ఉండటం ఎంతో అపురూపం! అన్నీ పరిపూర్ణంగా ఉండే ఒక అద్భుతం జరగాలంటే, ఆ దేవుడే దిగి రావాలి. అలా దిగి వచ్చిన దేవుడే శ్రీరాముడు. పరిపూర్ణమైనవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏ రూపంలో వచ్చినా, దాని పరిపూర్ణతను పండించగలడు. అందుకే ఆదర్శమూర్తి రాముడిగా ఆ స్వామి పూర్ణత్వాన్ని ప్రకటించాడు. ఆ నిండుదనమే ఒక మణిదీపంగా మానవజాతికి వెలుగు పంచుతోంది. అత్యంత ప్రాచీనమైన రామాయణాన్ని పరిశీలిస్తే, ఆనాటి మానవ సమాజం నాగరికంగా ఎంత ఎదిగిందో అవగతమవుతుంది. గ్రామ, జానపద, నగర ఆవాసాలు; పరిపాలనా పద్ధతులు, మానవ సంబంధాల మర్యాదలు ఎలా ఉండేవో అర్థమవుతుంది. వాగ్ధోరణిలో ఔచిత్యాలు, ప్రవర్తన సరళిలో సంస్కారాలు, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాదులు, కళారీతులు... ఇవన్నీ అభ్యుదయ స్థితిలో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి కాలంలో మహా వ్యక్తిత్వంతో రఘురాముడు రాజిల్లాడు. అద్భుత పరిపూర్ణ వ్యక్తిత్వం

సీతారామ కల్యాణం

చిత్రం
శ్రీరామనవమి’ అనగానే, మనందరికీ సీతారామ కల్యాణం గుర్తుకొస్తుంది. నిజానికి చైత్ర శుక్ల (శుద్ధ) నవమి రాముడి పుట్టినరోజే తప్ప- సీతారాముల పెళ్లిరోజు కాదు. వారి కల్యాణం వైశాఖ శుక్ల దశమినాడు జరిగిందని ‘వాల్మీకి రామాయణం’ చెబుతోంది. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి రెండూ- వారి వారి జన్మతిథులు. పుట్టిన రోజునాడు శాంతి కల్యాణాలు జరిపించడం సంప్రదాయం. శ్రీరాముడి పుట్టినరోజు వేడుకలు- సీతమ్మతో కలిపి జరిపించే క్రమంలో, శాంతి కల్యాణం చైత్ర శుద్ధ నవమి నాడు నిర్వహిస్తారు. రామాయణం రీత్యా, సీతమ్మది గౌతమ గోత్రం. రాముడిది వసిష్ఠ గోత్రం. భద్రాద్రిలో వెలసింది వైకుంఠుడన్న భావనతో శ్రీమహాలక్ష్మికి చెందిన సౌభాగ్య గోత్రాన్ని సీతమ్మకు, శ్రీమహావిష్ణువుదైన అచ్యుత గోత్రాన్ని శ్రీరాముడికి ఆపాదిస్తూ- కల్యాణ క్రతువులో ప్రవర చెబుతారు. భద్రాచలంలో మూలవిరాట్టుకు, ఆరుబయట ఉత్సవ మూర్తులకు ఒకేసారి కల్యాణం నిర్వహించడం ఒక విశేషం. అనేక ఏళ్ల క్రితం రామాలయంపై దుండగులు దాడి చేసినప్పుడు, అర్చక స్వాములు ఆ ఉత్సవ మూర్తులను గోదావరి సమీపంలో దాచి పెట్టారు. ఆ తరవాత వాటిని వెలికి తీసేటప్పుడు, సీతమ్మ ప్రతిమ కనిపించలేదు. ఈలోగా శ్రీరామనవమి రా

ధ్యాన సాధన

చిత్రం
‘సా ధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నారు పెద్దలు. ఈ లోకంలో ఏ పనైనా సాధన వల్లనే ఒనగూడుతుంది. అది ప్రాపంచికమైనా, పారమార్థికమైనా! ముఖ్యంగా సాధన అనేది పారమార్థికంగానే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. భగవంతుణ్ని పొందాలంటే చేయాల్సింది ఒకే ఒక్కటి- సాధన. దానికి కావాల్సింది...విద్య, సంపాదన, సంపద, కీర్తి, ప్రతిష్ఠ, ఆరోగ్యం, వయసు, సౌందర్యం...ఏదీ కాదు. సాధన ఒక్కటే! దృఢమైన సాధన చేయనిదే భగవంతుడు కరిగిరాడు. కదిలిరాడు. భక్తికి, ప్రేమకు పుస్తక పరిజ్ఞానం పెద్దగా అవసరం లేదు. కన్నప్ప, శబరి, రత్నాకరుడు (వాల్మీకి) ఏ పుస్తకాన్నీ చదవలేదు. ఏ యాత్రలూ చేయలేదు. పరమాత్మ మీద వారు గుండెల నిండా పరమ ప్రేమ నింపుకొన్నారు. పెద్దలు చెప్పిన అంశాన్ని సాధన చేశారు. గుండె అనే బండపై భక్తి అనే గంధపు చెక్కను అరగదీశారు. రాయే అరిగిందో, చెక్కే కరిగిందో వారికి తెలియదు. గంధం మాత్రం పడింది. అది ప్రేమ సుగంధం! సాధన మీద మనకు శంకలు కలుగుతుంటాయి. సాకేత రాముడి ఉనికి మీద కూడా! మన అమాయక ప్రశ్నలకు నవ్వుకుంటూ విజ్ఞులు బదులు చెబుతారు. ‘విచికిత్స వద్దు. సాధన చేయండి... సహనంతో. అప్పుడు మీరు ప్రశ్నలే అడగని స్థాయికి వెళతారు. ప్రశ్నల అవసరమే లేని స్

గృహ లక్ష్మి

చిత్రం
‘ధ న మూల మిదం జగత్‌’ అని నానుడి. డబ్బు అనే ఇరుసు మీదనే ప్రపంచం పరిభ్రమిస్తుంటుందని దాని అంతరార్థం. అందరికీ డబ్బుపై వ్యామోహం ఉంటుంది. దాన్ని ఎలా సంపాదించాలన్నదే కొండంత సమస్యగా కనిపిస్తుంది. అందుకు మన పెద్దలు కొన్ని నివారణోపాయాలు సూచించారు. ప్రధాన ఉపాయాలు మూడు. ఇల్లు, ఇల్లాలు లక్ష్మీకి ప్రతిరూపాలుగా ఉండేలా చూసుకోవడం మొదటిది. మనలోనే ఉన్న లక్ష్మీ తత్వాన్ని గుర్తించి, అనుగ్రహం కోసం ప్రయత్నించడం రెండోది. ‘అలక్ష్మి’ని సాగనంపటం ఎలాగో తెలుసుకోవడం మూడో ఉపాయం. ‘దేహమే దేవాలయం’ అంటుంది హంస గీత. దేహానికి గృహమే ఆలయం. అలా ఇంటిని తీర్చిదిద్దుకోవడం వల్ల అక్కడ లక్ష్మీ కళ తాండవిస్తుంది. పర్ణశాల వంటి పూరింటినైనా పరిశుభ్రం చేస్తే, అది పవిత్రత సంతరించుకుంటుంది. దేహాన్ని ఆలయంగా భావించిన మనిషి, అంతర్యామి నివాసానికి తగినట్లుగా దాన్ని తీర్చిదిద్దుకోవాలి. దేవాలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే అంతా శుభ్రపరుస్తారు. స్వామి పూజకు సర్వం సిద్ధం చేస్తారు. అలాగే శరీరధారి అయిన మనిషి ఉదయాన్నే నిద్ర లేచి ‘బుద్ధి’ అనే సేవకుడి సాయంతో దేహాలయాన్ని సిద్ధం చేసుకోవాలి. దైవశక్తులు బ్రహ్మ ముహూర్తంలో జాగృతమవుతాయంటారు. అ

శివ.. ధ్యానం.. కీర్తనం.. స్మరణం

చిత్రం
మార్కండేయుడు మృకండ మహర్షి , మరుద్వతి దంపతుల కుమారుడు . ఈశ్వర అనుగ్రహంతో కలిగిన కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటారు వాళ్లు . అయితే ఆ బాలకుడు 16 ఏళ్లు మాత్రమే జీవించి ఉంటాడని చెబుతాడు పరమేశ్వరుడు . అతనికి పదహారేళ్లు వచ్చాక తల్లిదండ్రులు తీవ్రంగా దుఃఖిస్తారు . వారి చింతకు కారణం తెలుసుకున్న మార్కండేయుడు పరమేశ్వరుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు . మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి వచ్చిన యముడు సైతం ఆతడి తపోదీక్షకు నివ్వెరపోతాడు . బాలకుడిపై పాశం వేయగా .. పరమేశ్వరుడు కాలరూపుడుగా ప్రత్యక్షమవుతాడు . మార్కండేయుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు .  ప్రతి మాసం కృష్ణ పక్షంలో చతుర్దశి పరివ్యాప్తమై ఉన్న రోజును శివరాత్రిగా భావిస్తారు . మాఘమాస కృష్ణ చతుర్దశిని ‘ మహాశివరాత్రి ’ గా జరుపుకుంటారు . ఈ రోజునే మహాలింగం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి . మాఘ మాసాన్ని సంవత్సర సారం అంటారు . అందుకే మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రిగా నిర్ణయించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది . మహాశివరాత్రి వ్రతం ఆచరిస్తే .. సంవ