కాణిపాకం-వినాయకుడు

సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకంశ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోందికాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున  ఆలయం ఉందిసర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు స్వామికి హిందువులే కాదుఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారుముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషందేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుందిస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.

క్షేత్రచరిత్రస్థలపురాణంసుమారు 1,000 ఏళ్ల కిత్రం  ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయిపూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డిమూగచెవిటి వాళ్లుగా జన్మించారుకర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారుఒక దశలో  గ్రామం కరవు కాటకాలతో అల్లాడిందిగ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొందికరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు మేరకు బావిలో తవ్వుతుండగా  పెద్ద బండరాయి అడ్డుపడిందిదాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మిందిరక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగిందిజరిగిన  విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు  స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారుబావిలో ‘గణనాథుని’ రూపం కన్పించిందిగ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారుస్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణిభూమి కాణి అంటే ఎకరం పొలం అని అర్థంమేర పారిందిఅప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చిందికాలక్రమంలో అదే ‘కాణిపాకంగా మారిందని ప్రశస్తి.

 బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!
కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారుస్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసంవ్యసనాలకు బానిసలైన వారు (తాగుడుదురలవాట్లుస్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకంఅసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకంలో ప్రమాణం చేద్దామాఅని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!

నిత్యం పెరిగే స్వామివరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడుదీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉందియాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు.
2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.

కాణిపాకం శివ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోందిప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉందిఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయంమణికంఠేశ్వరవరదరాజులువీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.

బ్రహ్మహత్యా పాతక నివారణార్థంస్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయందీన్ని 11  శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయిబ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు  ఆలయం నిర్మించారటఅద్భుత శిల్పకళ  ఆలయం సొంతంఇక్కడ మహాగణపతిదక్షిణామూర్తిసూర్యుడుషణ్ముఖుడుదుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారుఆలయ గాలి గోపురంప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయిలోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉందిఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారుఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలుమణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారుప్రత్యేక అభిషేకంఅర్చనలు చేస్తారు.

సర్పదోష పరిహారార్థం.. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం
స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగిందిగణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న  ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో  కథ ప్రచారంలో ఉందిజనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారుఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుందిఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.

పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధరరూ. 550
సేవాఫలితంస్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.

గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500
సేవాఫలితం: ‘కలౌ చండీ వినాయకః’ అంటే  కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతిమన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలుప్రతి పనికి పోటీఏదో ఒక ఆటంకం జరగవచ్చుఅన్ని విఘ్నాలను అధిగమించాలిఅంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలిస్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయిసకల శుభాలు కలుగుతాయి.

గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300
గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉందిమోదకం అంటే కుడుములు అని అర్థంహిందువులు  శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారుఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.

సహస్ర నామార్చనవ్రతపూజ టిక్కెట్‌ ధరరూ. 150, రూ. 58
సేవాఫలితం: ‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.

మూల మంత్రార్చన టిక్కెట్‌ ధరరూ. 300
సేవాఫలితందీనినే నారికేళ పూ అంటారువినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారువినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడువిష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదుదీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడుఅప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయిఅందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారుసకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.

సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధరరూ. 151
సేవాఫలితంగణేశ పురానంలో  వ్రతానికి విశేష స్థానం కల్పించారుదీన్ని శ్రీ కృష్ణుడుబ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారుసంతానంవ్యాపార అభివృద్ధిసకల విఘ్నాలు తొలగడంముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.

పూలంగి సేవ టిక్కెట్‌ ధరరూ. 1,000
సేవాఫలితంవివిధ రకాలైన పుష్పాలను గర్భాలయంఅంత్రాలయంఅర్ధమండపంస్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారురంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహంసౌభాగ్యం కలుగుతాయి.

అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధరరూ. 116
సేవాఫలితంచదువుల తండ్రి వినాయకుడుఅలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకంఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.

అన్నప్రాసన టిక్కెట్‌ ధరరూ.116
సేవాఫలితంపిల్లలకు అన్నప్రాసనంవిశిష్ఠరోజున చేస్తారువిఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభంఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుందిమొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధరరూ. 51
సేవాఫలితంవివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారుమొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.

వసతి.. రవాణా సౌకర్యాలుకాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ. దూరంలో ఉందిఅత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువేఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయిఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.
తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయిదగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)