యక్ష ప్రశ్నలు
మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మ రాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. వ్యవహారికములో చిక్కు ప్రశ్నలను, సమాధానం కష్టతరమైన ప్రశ్నలకు పర్యాయంగా యక్ష ప్రశ్నలు అనే మాటను వాడతారు.
పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి లేడికొమ్ములలో యిరుక్కొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్యవాణి పలికినది... ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు
72 ప్రశ్నలు-జవాబులు
ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి
రూపంలో 72 చిక్కు
ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:
1. ప్ర: సూర్యుడిని ఉదయింపజేయువారు ఎవరు?
జ: బ్రహ్మం.
2. ప్ర: సూర్యుడిచుట్టూ తిరుగువారు ఎవరు?
జ: దేవతలు.
3. ప్ర: సూర్యుడిని అస్తమింపజేయునది ఏది?
జ: ధర్మం.
4. సూర్యుడు దేని ఆధారంగా నిలిచియున్నాడు?
జ: సత్యం.
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
జ: వేదం.
6. మానవుడు దేనివలన మహాత్తుని పొందును?
జ: తపస్సు. (సత్యం, ధర్మం, త్యాగం, దానం, కలిగియుడటం)
7. మానవునకు సహాయపడునది ఏది?
జ: ధైర్యం, దైవం.
8. మానవుడు దేనివలన బుద్దిమంతుడగును?
జ: పెద్దలను సేవించడం వలన.
9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును?
జ: అధ్యయము వలన. పెద్దలను గౌరవించడం వలన.
10. మానవునికి సాదుత్వాలు ఎలా సంభవిస్తాయి?
జ: తపస్సు వలన సాధుస్వభావం, శిష్టాచార బ్రష్టత్వం వలన అసాదుస్వభావం సంభవించును.
11. మానవుడు మనుషుడు ఎట్లు అవుతాడు?
జ: ,మృత్యుభయం వలన.
12. జీవన్మ్రుతుడేవరు?
జ: దేవతలకూ, అతిధులకూ, పితృదేవతలకూ, సేవకులకూ పెట్టకుండా తినేవాడు. బ్రతికున్నా చచ్చినవాడితో సమానం.
13. భూమికంటే భారమైనది ఏది?
జ: తల్లి.
14. ఆకాశం కంటే విశాలమైనవారు ఎవరు?
జ: తండ్రి.
15. గాలికంటే వేగవంతమైనది ఏది?
జ: మనస్సు.
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది?
జ: ఇతరులు తనపట్ల్ల ఏపని చేస్తే ఏ మాట మాట్లాడితే తన మనస్సుకి భాధ కలుగుతుందో! ఇతరుల పట్ల కూడా ఆమాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.
17. తృణం కంటే దట్టమైనది ఏది?
జ: చింత.
18. నిద్రలో కూడా కన్నుమూయనిది?
జ: చేప.
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
జ: అస్త్రవిద్యతో.
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
జ: యజ్ఞ యాగాలు చేయడం వలన.
21. జన్మించి ప్రాణం లేనిది?
జ: గ్రుడ్డు.
22. రూపం ఉన్నా హృదయం లేనిది?
జ: రాయి.
23. మానవునికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
జ: శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన, సంపద ఉండి కూడా దానధర్మాల మాట తలపెట్టకపోవడం వలన.
24. ఎల్లప్పుడూ వేగం గలది ఏది?
జ: నది.
25. రైతుకి ఏది ముఖ్యం?
జ: వాన.
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు చనిపోయినవానికి బందువులు ఎవరు?
జ: బాటసారికి సార్ధం, రోగికి వైద్యుడు, గృహస్థునకు శీలవతి మరియు అనుకూలవతి అయిన భార్య,చనిపోయినవారికి సుకర్మ(చేసిన పాపపుణ్యములు) బంధువులు. ఇంకా ఉన్నాయి..
27. ధర్మానికి ఆధారమేది?
జ: దయ దాక్షిణ్యం
28. కీర్తికి ఆశ్రయమేది?
జ: దానం
29. దేవలోకానికి దారి ఏది?
జ: సత్యం
30. సుఖానికి ఆధారం ఏది?
జ: శీలం
31. మనిషికి దైవిక బంధువులెవరు?
జ: భార్య/భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు?
జ: కుమారుడు
33. మానవునకు జీవనాధారమేది?
జ: మేఘం
34. మనిషికి దేనివల్ల సంతసించును?
జ: దానం
35. లాభాల్లో గొప్పది ఏది?
జ: ఆరోగ్యం
36. సుఖాల్లో గొప్పది ఏది?
జ: సంతోషం
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
జ: అహింస
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?
జ: మనస్సు
39. ఎవరితో సంధి శిధిలమవదు?
జ: సజ్జనులతో
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది?
జ: యాగకర్మ
41. లోకానికి దిక్కు ఎవరు?
జ: సత్పురుషులు
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?
జ: భూమి, ఆకాశములందు
43. లోకాన్ని కప్పివున్నది ఏది?
జ: అజ్ఞానం
44. శ్రాద్ధవిధికి సమయమేది?
జ: బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?
జ: వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ
విడచినచో
46. తపస్సు అంటే ఏమిటి?
జ: తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం
47. క్షమ అంటే ఏమిటి?
జ: ద్వంద్వాలు సహించడం
48. సిగ్గు అంటే ఏమిటి?
జ: చేయరాని పనులంటే జడవడం
49. సర్వధనియనదగు వాడెవడౌ?
జ: ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను
సమంగా ఎంచువాడు
50. జ్ఞానం అంటే ఏమిటి?
జ: మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం
51. దయ అంటే ఏమిటి?
జ: ప్రాణులన్నింటి సుఖము కోరడం
52. అర్జవం అంటే ఏమిటి?
జ: సదా సమభావం కలిగి వుండడం
53. సోమరితనం అంటే ఏమిటి?
జ: ధర్మకార్యములు చేయకుండుట
54. దు:ఖం అంటే ఏమిటి?
జ: అజ్ఞానం కలిగి ఉండటం
55. ధైర్యం అంటే ఏమిటి?
జ: ఇంద్రియ నిగ్రహం
56. స్నానం అంటే ఏమిటి?
జ: మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం
57. దానం అంటే ఏమిటి?
జ: సమస్తప్రాణుల్ని రక్షించడం
58. పండితుడెవరు?
జ: ధర్మం తెలిసినవాడు
59. మూర్ఖుడెవడు?
జ: ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు
60. ఏది కాయం?
జ: సంసారానికి కారణమైంది
61. అహంకారం అంటే ఏమిటి?
జ: అజ్ఞానం
62. డంభం అంటే ఏమిటి?
జ: తన గొప్పతానే చెప్పుకోవటం
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును?
జ: తన భార్యలో, తన
భర్తలో
64. నరకం అనుభవించే వారెవరు?
జ: ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ
శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం
చెయ్యనివాడు
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?
జ: ప్రవర్తన మాత్రమే
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
జ: మైత్రి
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?
జ: అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు
ఏమవుతాడు?
జ: సుఖపడతాడు
69. ఎవడు సంతోషంగా ఉంటాడు?
జ: అప్పులేనివాడు, తనకున్న
దానిలో తిని తృప్తి చెందేవాడు
70. ఏది ఆశ్చర్యం?
జ: ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం
చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
జ: ప్రియయూ అప్రియమూ, సుఖమూ
దు:ఖమూ
మొదలైన వాటిని సమంగా చూసేవాడు
72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు?
జ: నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి
లేములందూ, సుఖదు:ఖాదులందూ
సముడై, లభించిన
దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడుగా
ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు
మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మ రాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. వ్యవహారికములో చిక్కు ప్రశ్నలను, సమాధానం కష్టతరమైన ప్రశ్నలకు పర్యాయంగా యక్ష ప్రశ్నలు అనే మాటను వాడతారు.
పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి లేడికొమ్ములలో యిరుక్కొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్యవాణి పలికినది... ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు
72 ప్రశ్నలు-జవాబులు
ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి
రూపంలో 72 చిక్కు
ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:
1. ప్ర: సూర్యుడిని ఉదయింపజేయువారు ఎవరు?
జ: బ్రహ్మం.
2. ప్ర: సూర్యుడిచుట్టూ తిరుగువారు ఎవరు?
జ: దేవతలు.
3. ప్ర: సూర్యుడిని అస్తమింపజేయునది ఏది?
జ: ధర్మం.
4. సూర్యుడు దేని ఆధారంగా నిలిచియున్నాడు?
జ: సత్యం.
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
జ: వేదం.
6. మానవుడు దేనివలన మహాత్తుని పొందును?
జ: తపస్సు. (సత్యం, ధర్మం, త్యాగం, దానం, కలిగియుడటం)
7. మానవునకు సహాయపడునది ఏది?
జ: ధైర్యం, దైవం.
8. మానవుడు దేనివలన బుద్దిమంతుడగును?
జ: పెద్దలను సేవించడం వలన.
9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును?
జ: అధ్యయము వలన. పెద్దలను గౌరవించడం వలన.
10. మానవునికి సాదుత్వాలు ఎలా సంభవిస్తాయి?
జ: తపస్సు వలన సాధుస్వభావం, శిష్టాచార బ్రష్టత్వం వలన అసాదుస్వభావం సంభవించును.
11. మానవుడు మనుషుడు ఎట్లు అవుతాడు?
జ: ,మృత్యుభయం వలన.
12. జీవన్మ్రుతుడేవరు?
జ: దేవతలకూ, అతిధులకూ, పితృదేవతలకూ, సేవకులకూ పెట్టకుండా తినేవాడు. బ్రతికున్నా చచ్చినవాడితో సమానం.
13. భూమికంటే భారమైనది ఏది?
జ: తల్లి.
14. ఆకాశం కంటే విశాలమైనవారు ఎవరు?
జ: తండ్రి.
15. గాలికంటే వేగవంతమైనది ఏది?
జ: మనస్సు.
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది?
జ: ఇతరులు తనపట్ల్ల ఏపని చేస్తే ఏ మాట మాట్లాడితే తన మనస్సుకి భాధ కలుగుతుందో! ఇతరుల పట్ల కూడా ఆమాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.
17. తృణం కంటే దట్టమైనది ఏది?
జ: చింత.
18. నిద్రలో కూడా కన్నుమూయనిది?
జ: చేప.
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
జ: అస్త్రవిద్యతో.
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
జ: యజ్ఞ యాగాలు చేయడం వలన.
21. జన్మించి ప్రాణం లేనిది?
జ: గ్రుడ్డు.
22. రూపం ఉన్నా హృదయం లేనిది?
జ: రాయి.
23. మానవునికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
జ: శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన, సంపద ఉండి కూడా దానధర్మాల మాట తలపెట్టకపోవడం వలన.
24. ఎల్లప్పుడూ వేగం గలది ఏది?
జ: నది.
25. రైతుకి ఏది ముఖ్యం?
జ: వాన.
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు చనిపోయినవానికి బందువులు ఎవరు?
జ: బాటసారికి సార్ధం, రోగికి వైద్యుడు, గృహస్థునకు శీలవతి మరియు అనుకూలవతి అయిన భార్య,చనిపోయినవారికి సుకర్మ(చేసిన పాపపుణ్యములు) బంధువులు. ఇంకా ఉన్నాయి..
27. ధర్మానికి ఆధారమేది?
జ: దయ దాక్షిణ్యం
28. కీర్తికి ఆశ్రయమేది?
జ: దానం
29. దేవలోకానికి దారి ఏది?
జ: సత్యం
30. సుఖానికి ఆధారం ఏది?
జ: శీలం
31. మనిషికి దైవిక బంధువులెవరు?
జ: భార్య/భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు?
జ: కుమారుడు
33. మానవునకు జీవనాధారమేది?
జ: మేఘం
34. మనిషికి దేనివల్ల సంతసించును?
జ: దానం
35. లాభాల్లో గొప్పది ఏది?
జ: ఆరోగ్యం
36. సుఖాల్లో గొప్పది ఏది?
జ: సంతోషం
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
జ: అహింస
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?
జ: మనస్సు
39. ఎవరితో సంధి శిధిలమవదు?
జ: సజ్జనులతో
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది?
జ: యాగకర్మ
41. లోకానికి దిక్కు ఎవరు?
జ: సత్పురుషులు
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?
జ: భూమి, ఆకాశములందు
43. లోకాన్ని కప్పివున్నది ఏది?
జ: అజ్ఞానం
44. శ్రాద్ధవిధికి సమయమేది?
జ: బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?
జ: వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ
విడచినచో
46. తపస్సు అంటే ఏమిటి?
జ: తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం
47. క్షమ అంటే ఏమిటి?
జ: ద్వంద్వాలు సహించడం
48. సిగ్గు అంటే ఏమిటి?
జ: చేయరాని పనులంటే జడవడం
49. సర్వధనియనదగు వాడెవడౌ?
జ: ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను
సమంగా ఎంచువాడు
50. జ్ఞానం అంటే ఏమిటి?
జ: మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం
51. దయ అంటే ఏమిటి?
జ: ప్రాణులన్నింటి సుఖము కోరడం
52. అర్జవం అంటే ఏమిటి?
జ: సదా సమభావం కలిగి వుండడం
53. సోమరితనం అంటే ఏమిటి?
జ: ధర్మకార్యములు చేయకుండుట
54. దు:ఖం అంటే ఏమిటి?
జ: అజ్ఞానం కలిగి ఉండటం
55. ధైర్యం అంటే ఏమిటి?
జ: ఇంద్రియ నిగ్రహం
56. స్నానం అంటే ఏమిటి?
జ: మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం
57. దానం అంటే ఏమిటి?
జ: సమస్తప్రాణుల్ని రక్షించడం
58. పండితుడెవరు?
జ: ధర్మం తెలిసినవాడు
59. మూర్ఖుడెవడు?
జ: ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు
60. ఏది కాయం?
జ: సంసారానికి కారణమైంది
61. అహంకారం అంటే ఏమిటి?
జ: అజ్ఞానం
62. డంభం అంటే ఏమిటి?
జ: తన గొప్పతానే చెప్పుకోవటం
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును?
జ: తన భార్యలో, తన
భర్తలో
64. నరకం అనుభవించే వారెవరు?
జ: ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ
శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం
చెయ్యనివాడు
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?
జ: ప్రవర్తన మాత్రమే
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
జ: మైత్రి
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?
జ: అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు
ఏమవుతాడు?
జ: సుఖపడతాడు
69. ఎవడు సంతోషంగా ఉంటాడు?
జ: అప్పులేనివాడు, తనకున్న
దానిలో తిని తృప్తి చెందేవాడు
70. ఏది ఆశ్చర్యం?
జ: ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం
చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
జ: ప్రియయూ అప్రియమూ, సుఖమూ
దు:ఖమూ
మొదలైన వాటిని సమంగా చూసేవాడు
72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు?
జ: నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి
లేములందూ, సుఖదు:ఖాదులందూ
సముడై, లభించిన
దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడుగా
ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి