పోస్ట్‌లు

ఆధ్యాత్మికత లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సమస్యలు మనిషిలోని పోరాటశక్తిని పదునెక్కిస్తాయి

చిత్రం
ఒక రైతు తన పొలంలో బంగారు తీగెల రకం ధాన్యం పండించదలచి , పెట్టుబడి ఎక్కువ పెట్టాలి కనుక ఎందుకైనా మంచిదని జ్యోతిష్యం తెలిసిన పండితుణ్ని సంప్రతించాడు . ఆయన వేళ్ల మీద లెక్కలు వేసి , ఆకాశంకేసి చూస్తూ ‘ ఉహూ ... లాభం లేదు . ఈ ఏడాది వానలు సరిగ్గా పడవు . పంట వెయ్యకు ’ అన్నాడు . రైతు నిరాశగా తిరిగి వచ్చేశాడు . ఆశ్చర్యంగా పక్క పొలం రైతు అదే పంట వేశాడు ! రైతు తాను విన్న భవిష్యవాణి గురించి అతడికి చెప్పాడు . ఆ రైతు నవ్వి ‘ నేను అలాంటివి నమ్మను . నా రెక్కల కష్టాన్నే నమ్ముతాను ’ అన్నాడు . అన్నట్లుగానే తన కృషి మీద పూర్తి నమ్మకంతో ఆ రైతు పంటను శ్రద్ధగా చూసుకున్నాడు . భవిష్యవాణికి విరుద్ధంగా చేను విరగపండింది . వానలు సరిగ్గా పడవనే భవిష్యవాణిని నమ్మిన రైతు మామూలు ధాన్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది . స్వయంకృషి వల్ల శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది . గట్టి సంకల్పం ఉంటే అసాధ్యమనేదే ఉండదు . విద్యార్థులు శ్రద్ధ , కృషి జోడిస్తే తప్పటమనే ప్రశ్నే తలెత్తదు . ‘ నేను మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుణ్ని కావాలి ’ అనే పట్టు...

సదవగాహన

చిత్రం
వనంలోకి వసంతం ప్రవేశించింది. అంతా పచ్చగా మారింది. అప్పుడే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కురిసింది. నిన్నటి విత్తనం నేడు మొలకగా మారి , ఆ తరవాత ఆకులతో విచ్చుకుంది. ఆ గాలి తాకుతూ , శ్వాస నిరంతరం సాగుతూ , మనిషి ప్రాణం నిలబెడుతోంది. ‘ ఇదంతా ఎవరు చేస్తున్నారు ’ అని ప్రశ్నించే ముందు , ప్రకృతి పనిచేసే తీరును మనిషి తెలుసుకోవాలి. అంతకన్నా ముందు , ఆ ప్రకృతి- విశ్వశక్తి అధీనంలో ఉందని గ్రహించాలి. మనసు , బుద్ధి , అహంకారం , ఆకాశం , గాలి , నిప్పు , నీరు , భూమి అని ఎనిమిది విధాలుగా ప్రకృతి ఉంటుంది. అది ‘ అష్టావిధ ప్రకృతి ’ అని భగవద్గీతలో కృష్ణపరమాత్మ స్పష్టీకరించాడు. అదంతా తన అధీనంలోనే ఉందని వెల్లడించాడు. మట్టిముద్ద గురించి తెలిస్తే , ఆ నేల సారమంతా అవగతమవుతుంది. అదేవిధంగా సత్యం అనేది మరెక్కడో కాదు- మనిషిలోనే ఉంది. ఇవన్నీ అతడు స్పష్టంగా గ్రహించాలి. అందువల్ల జీవనయానం సుఖవంతంగా మారుతుందని శాస్త్రాలు విశదీకరిస్తున్నాయి. అనేకులు అనేక రకాలుగా చెబుతారు. పలు విధాలుగా వాదించేవారూ ఉంటారు. వివిధ రూపాల్లో చర్చలు సాగుతూనే ఉంటాయి. ఏవి ఎలా ఉన్నా , ఏనాటికీ సత్యం మారదు. దాని రూపాన్ని అసలే మార్చుకోదు. సత్యం...